Center is good news for chilli farmers

మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం

న్యూఢిల్లీ: ఏపీలో మర్చిధరలు పడిపోవడంతో రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రాన్ని చంద్రబాబు రంగంలోకి దించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కనీస ధరను రూ. 11,781 గా నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్వింటా మిర్చికి ఈ ధర వర్తిస్తుంది. ధరలు భారీగా పడిపోవడంతో రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. ఇక నుంచి సాగు ఖర్చు.. అమ్మకపు వ్యయం మధ్య వ్యత్యాన్ని కేంద్రం చెల్లిస్తుంది.

Advertisements
మిర్చి రైతులకు కేంద్రం గుడ్

నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో

మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ధర ప్రకటించింది. 2.58లక్షల మెట్రిక్‌ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది. నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్రం మిర్చికి ధర ప్రకటించింది.

మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులకు మద్దతు

కాగా, ఇటీవల మద్దతు ధర లభించడం లేదని మిర్చి రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేంద్రంతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని కోరింది. అంతలోనే మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులకు మద్దతు పలికారు. మొత్తం మీద ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వానిదని కొందరు అంటుండగా, మరికొందరు జగన్ పర్యటనతోనే కేంద్రం స్పందించిదని సోషల్ మీడియాలో వైరల్ చేయడం విశేషం.

Related Posts
మహారాష్ట్రలో మహాయుతి కూటమి 220 మార్క్ దాటింది..
MAHAYUTI

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బిజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 222 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు ప్రారంభ ట్రెండ్‌లు సూచిస్తున్నాయి. మహాయుతి కూటమి బిజేపీ, Read more

తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టు 2025 సంవత్సరానికి సంబంధించి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, మరియు ఆఫీస్ సబార్డినేట్ Read more

Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కేవలం కలగానే మిగిలిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు Read more

కెన్యా బంగారు గనిలో చిక్కుకుపోయిన 20 మంది మైనర్లు!
kenya

పశ్చిమ కెన్యాలోని బంగారు గని పాక్షికంగా కూలిపోవడంతో డజను మంది చిక్కుకుపోయారని పోలీసులు మంగళవారం తెలిపారు. పొరుగు దేశాలతో పోలిస్తే కెన్యాలో చిన్న మైనింగ్ రంగం ఉంది. Read more

×