Cabinet approves AP Annual Budget

ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్‌ ఆమోదం

మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్‌‌

అమరావతి: 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్‌‌ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు అసెంబ్లీ లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ , శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్‌

ఈ బడ్జెట్‌‌లో సూపర్ సిక్స్ పథకాలు

కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుండటం విశేషం. అయితే, ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఇటు సాధారణ ప్రజల్లోనూ ఓ రకమైన ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్‌‌లో సూపర్ సిక్స్ పథకాల తో పాటు రాష్ట్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజన్-2047 లక్ష్యంగా ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక, 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 10 శాతం ఎక్కువ. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

Related Posts
తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బరిలో 90మంది
Telangana MLC nomo

మెదక్ నియోజకవర్గం కోసం 56 మంది అభ్యర్థులు పోటీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ Read more

కోదండ రామాలయంలో కల్యాణోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన నాయుడు
కోదండ రామాలయంలో కల్యాణోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన నాయుడు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా కడప జిల్లా పరిధిలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో పర్యటించారు. ఈ పుణ్యక్షేత్రం, భక్తులే కాకుండా, జాతీయ Read more

Chandrababu Naidu: ఏప్రిల్ లోమెగా డీఎస్సీ నోటిఫికేషన్ :చంద్రబాబు నాయుడు
ఏప్రిల్ లో DSC నోటిఫికేషన్ విడుదల: చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం Read more

సిరియాలో ఘర్షణలు..70 మందికి పైగా మృతి
Clashes in Syria leave more than 70 dead

లటాకియా : ఇస్లామిక్ దేశం సిరియా లో తిరుగుబాటుదారుల ఆక్రమణతో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. అనంతరం అబూ మొహమ్మద్ Read more