KTR : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకృతి విధ్వంసంతో ఒక వన్యప్రాణి బలైందని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ HCUలోని అడవిని నరికించడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిందన్నారు. చెట్లను తొలగించడంతో ఎటు వెళ్లాలో తెలియక జింక వర్సిటీ పరిధిలోకి వచ్చిందని తద్వారా కుక్కల దాడిలో మృతి చెందిందన్నారు. ఒక వన్య ప్రాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
జింకపై విచక్షణారహితంగా దాడి
కంచ గచ్చిబౌలిలో 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు జింక వచ్చింది. జింకను చూసిన కుక్కలు మొరుగుతూ.. దానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన జింకను హెచ్సీయూ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది.. వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. జింకకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో అది చనిపోయింది.
మూడు రోజుల్లో 100 ఎకరాల్లో పచ్చని చెట్లను నరికివేత
ఇక, చాలా జింకలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ జింకలను జనాలు చేరదీసి.. వాటికి నీళ్లను అందిస్తున్నారు. మూడు రోజుల్లో 100 ఎకరాల్లో పచ్చని చెట్లను నరికివేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.