A landmine exploded in Jammu and Kashmir. Six jawans were injured

పేలిన మందుపాత‌ర‌.. జ‌వాన్ల‌కు గాయాలు

రాజౌరి: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు సమీపంలో పేలుడు సంభవించింది. రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో మందుపాతర పేలి ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే రాజౌరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఖంబ ఫోర్ట్ సమీపంలో గోర్భా రైఫిల్స్ గస్తీ నిర్వహిస్తు్న్న సమయంలో మంగ‌ళ‌వారం ఉద‌యం 10.45 గంటల ప్రాంతంలో పేలుడు ఘటన సంభవించింది.

Advertisements
image
image

సరిహద్దుల భద్రత, చొరబాట్ల నిరోధక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక మందుపాతరపై గస్తీ జవాను ఒకరు కాలు వేయడంతో అది పేలిందని, దీంతో ఆరుగురు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వర్షాల కారణంగా మందుపాతరలు డిస్‌ప్లేస్ అవుతుంటాయని చెబుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించి ఇతమిత్థమైన కారణంపై ఆర్మీ విచారణ ప్రారంభించింది.

కాగా, జ‌న‌వ‌రి 4వ తేదీన జ‌వాన్ల‌తో వెళ్తున్న ఆర్మీ ట్ర‌క్కు ప్ర‌మాద‌వ‌శాత్తూ బందీపోర్ వ‌ద్ద లోయ‌లో ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో న‌లుగురు సైనికులు చ‌నిపోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. డ్రైవ‌ర్ త‌ప్పిదం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు నిర్ధారించిన సంగ‌తి తెలిసిందే.

Related Posts
chiranjeevi: చిరు పేరుతో వసూళ్లపై వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్
chiranjeevi: చిరు పేరుతో వసూళ్లపై వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్

తెలుగు సినీ ప్రపంచంలో చిరంజీవి పేరు ప్రత్యేకమైనది. ఆయన ఏ అంశంపైనా స్పందించినా అది పెద్ద చర్చనీయాంశంగా మారిపోతుంది. తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ Read more

BJP నేతకు తల వంచి నమస్కరించిన IAS
Rajasthan District Collecto

రాజస్థాన్ బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబి BJP నేత సతీష్ పూనియాకు వంగి వంగి నమస్కారాలు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో Read more

HCA : సన్ రైజర్స్ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ
SUNrisers HCA

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ పాస్‌ల కోసం ఒత్తిడి తెస్తున్నారని, హెచ్‌సీఏ Read more

కమాండెంట్ గంగారాం మృతిపట్ల కేటీఆర్ సంతాపం
KTR condoles the death of Commandant Gangaram

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, 17వ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ గంగారాం (58) మృతిపట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. Read more

Advertisements
×