డిసెంబర్ 26న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్, ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న సిరీస్ 1-1తో సమానంగా ఉన్న నేపధ్యంలో ఎంతో కీలకమైనది.ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కు భారత జట్టు చేరుకోవాలంటే ఈ రెండు మ్యాచులు చాలా అవసరమైనవి.భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో కొన్ని కీలక మార్పులు చేయాలని చూస్తున్నారు.ఈ టెస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్కు రోహిత్ శర్మ,యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ జత కలిసే అవకాశం ఉంది.అందువల్ల,కేఎల్ రాహుల్ మూడు స్థానాల్లో లేదా మరో స్థానంలో batting చేయవచ్చు.భారత బౌలింగ్ లైనప్ గురించి చెప్పుకుంటే జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ఆకాష్ దీప్ తమ స్థానాలను కాపాడుకుంటారు.
స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ మరియు రవీంద్ర జడేజా జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి.అయితే, గిల్ లేదా నితీష్ కుమార్ రెడ్డి స్థానాలు మరిన్ని మార్పుల దృష్టిలో ఉన్నాయి. వాతావరణం విషయానికొస్తే,మెల్బోర్న్లో మ్యాచ్ జరగబోయే ఐదు రోజులలో మూడవ మరియు నాలుగవ రోజులు 25% వర్షం పడే అవకాశం ఉందని అంచనా.అయితే,ఈ మ్యాచ్ చాలా వరకు స్పష్టమైన వాతావరణంలోనే కొనసాగుతుందని ఊహిస్తున్నారు.
ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ ప్రస్థానాన్ని ప్రకటించింది.నాథన్ మెక్స్వీనీ స్థానంలో 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్ అరంగేట్రం చేయబోతున్నాడు.ట్రావిస్ హెడ్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్తో జట్టులోకి వచ్చాడు. అలాగే, స్కాట్ బోలాండ్ కూడా జోష్ హేజిల్వుడ్ స్థానంలో ఎంపికయ్యాడు.ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు చారిత్రక అనుభవాన్ని అందించబోతుంది. రికార్డులు, వాతావరణం, మరియు ప్లేయర్ ఫారమ్ ఆధారంగా ఈ టెస్ట్ కీలకంగా మారుతోంది.