ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తన ఇటీవల చేసిన వ్యాఖ్యల విషయంలో త్వరలోనే క్షమాపణలు చెప్పబోతున్నారని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఒక వీడియోను విడుదల చేస్తూ ఇటీవల జరిగిన పొట్టేల్ సినిమా విజయోత్సవం సందర్భంగా రివ్యూలు రాసే వారి గురించి చేసిన వ్యాఖ్యలతో కొంతమంది మనసుకు మోసం చేసానని అంగీకరించారు అలా బాధపడిన వారికి క్షమాపణలు చెబుతానని తన మాటలను సమీక్షించుకొని సరైన సందేశాన్ని త్వరలో అందిస్తానని చెప్పారు అంతేకాకుండా ప్రేక్షకులను నిరీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ “సినిమా ఎలా తీయాలో తెలియని వారు రివ్యూలు రాస్తూ సినిమాలను తక్కువ చేసి చూపిస్తున్నారు” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు “అలాంటివారికి సినిమా విశ్లేషణలు చేయడం ఆపడం మంచిదని” కూడా ఆయన అన్నారు అయితే, ఆయన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు పలు సినీ విమర్శకులు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిర్యాదు చేశారు అంతేగాక ఈ ఘటనపై ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా స్పందించింది “శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలు సమీక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి ఆయనపై చర్యలు తీసుకోవాలని” డిమాండ్ చేశారు.