pawan kalyan to participate in palle panduga in kankipadu

నేడు పిఠాపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

అమరావతి: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో కూడా డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలోనే రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించనున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి స్థానిక అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కూడా విడుల చేయనున్నారు.

కాగా, సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్‌ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు. అనంతరం గొల్లప్రోలు హౌసింగ్ కాలనీకి, సూరంపేట హ్యాబిటేషన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ ను ప్రారంభించి.. తహశీల్దార్ కార్యాలయంలో పనులకు శ్రీకారం చుడతారు.

ఇకపోతే..మధ్యాహ్నం 1 గంటకు చేబ్రోలులో తన నివాసానికి చేరుకుని పవన్‌ కళ్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు చేబ్రోలు నుంచి బయల్దేరి పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండపానికి చేరుకుని ఆర్ఆర్ బీహెచ్ఆర్ డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తారు, అలాగే కల్యాణమండపం మరమ్మతు పనులు, ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరమ్మతు పనుల్ని ప్రారంభిస్తారు. పిఠాపురంలోని బాదం మాధవ జిల్లా పరిషత్ హైస్కూల్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ లోని పీ.వెంకటాపురం గెస్ట్ హౌస్ కు చేరుకుని, చేబ్రోలులోని తన నివాసానికి వెళ్తారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.

ఇంక మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం తన నివాసం నుంచి కొత్తపల్లి పీహెచ్ సీకి చేరుకుని.. పీహెచ్ఎస్ ఔట్ పేషెంట్ విభాగానికి, యు.కొత్తపల్లి మండలంలోని పలు స్కూళ్లకు శంకుస్థాపనలు చేస్తారు. 1 గంటకు చేబ్రోలు నివాసానికి చేరుకుని, 3 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు.

Related Posts
6 నెలల్లో అందుబాటులోకి బాలికల క్యాన్సర్‌ వ్యాక్సిన్‌
6 నెలల్లో అందుబాటులోకి బాలికల క్యాన్సర్‌ వ్యాక్సిన్‌

మహిళలను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్న క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా క్యాన్సర్‌లను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ను ఐదు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి Read more

కత్తితో హల్ చల్..
employee attack

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు లీవ్స్ ఉండటం సహజమే.ఏదైనా అత్యవసర పని ఉన్నప్పుడు అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు ప్రైవేట్ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు లీవ్స్ పెట్టడం చూస్తుంటాం. ఒకవేళ Read more

ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు
online certificate

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి సర్టిఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇది విద్యార్థులు, వారి Read more

అధికారుల మీద దాడి..మనమీద మనం దాడి చేసుకునట్లే: మంత్రి పొంగులేటి
Minister ponguleti srinivasa reddy

హైదరాబాద్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వికారాబాద్‌ ఘటనపై మరోసారి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. వికారాబాద్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *