అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జో బైడెన్.. చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. పొరుగుదేశం క్యూబపై ఉన్న ఉగ్రవాద దేశం ముద్రను తొలగించారు. అమెరికా రూపొందించుకున్న ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబను తొలగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్.. కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.జో బైడెన్ పదవీ కాలం ముగియబోతోంది. ఈ నెల 19వ తేదీ వరకే ఈ హోదాలో కొనసాగుతారు. 20వ తేదీన ఆ దేశ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభమౌతుంది.

ఒత్తిళ్ల నేపథ్యంలో జో బైడెన్ వెనక్కి
2021 జనవరి 12వ తేదీన క్యూబను ఉగ్రవాద దేశాల జాబితాలోకి చేర్చింది అమెరికా. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 2019లోని సెక్షన్లు 1754 (సీ), 1768 (సీ) కింద ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉత్తరకొరియా, ఇరాన్, సిరియా ఈ జాబితాలో ఉన్న మిగిలిన దేశాలు. వాటి సరసన క్యూబానూ చేర్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. క్యూబపై ఉగ్రవాద ముద్ర వేయడం సరికాదంటూ 123 దేశాలు గతంలో ప్రకటించాయి. ఈ మేరకు ఓ డిక్లరేషన్పై అవి సంతకాలు చేశాయి. ఇందులో- యూరోపియన్ యూనియన్, స్పెయిన్, కెనడా, కొలంబియా, చిలీ, బ్రెజిల్.. వంటి దేశాలు దేశాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఈ డిక్లరేషన్ను అప్పట్లో జారీ చేసింది. ఆర్థికం సహా క్యూబాపై అనేక రకాల ఆంక్షలను విధించడాన్నీ తప్పుపట్టాయి. అంతర్జాతీయ వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో జో బైడెన్ వెనక్కి తగ్గినట్టే కనిపించింది. ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.