ys sharmila asked cm chandrababu to pay the pending dues of aarogyasri

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల

అమరావతి: పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకం. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చింది. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది అని షర్మిల ఫైర్‌ అయ్యారు.

image
image

ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ.. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉంది. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయండి. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలి అని వైఎస్‌ షర్మిల డిమాండ్ చేశారు.

వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలంటూ చంద్రబాబుు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తోన్నామని షర్మిల చెప్పారు. పెండింగ్ బకాయిలు 3,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని అన్నారు.

Related Posts
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలకు నిషేధం.. !
Assembly sessions to resume

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫోటోలు, వీడియోలు తీయకూడదని ఆంక్షలు విధించారు. కొత్త నిబంధనను అమలు చేయాలంటూ అసెంబ్లీ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ Read more

ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బిజినెస్ స్కూల్స్ నుండి నియమించాలి:నరాయణ మూర్తి
narayanamurthy

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త నరాయణ మూర్తి ఇటీవల ఐఎఎస్ (Indian Administrative Service) మరియు ఐపీఎస్ (Indian Police Service) అధికారులను UPSC (Union Public Read more

12 ఎకరాల స్థలం కొన్న పవన్ కళ్యాణ్..ఎక్కడంటే..!!
pawan kalyan 200924

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో రాజకీయ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడానికి మరో 12 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. పవన్ Read more

ముంబైలో “డిజిటల్ అరెస్ట్” పేరిట మహిళను మోసం చేసిన నకిలీ పోలీసుల బృందం
digital arrest

ముంబైలో ఒక మహిళను ఓ మోసపూరిత స్మగ్లర్ బృందం మోసం చేసింది. వీడియో కాల్ ద్వారా ఆమెను బలవంతంగా నగ్నంగా చేయించి ₹1.7 లక్షలు దోచుకున్నారు. పోలీసులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *