YS Jagan visit to Ananta district on the 8th

YS Jagan : 8న అనంత జిల్లాలో వైఎస్‌ జగన్ పర్యటన

YS Jagan : వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైసీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌ బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు.

Advertisements
  అనంత జిల్లాలో వైఎస్‌ జగన్

న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా

తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Also: జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్న కేసీఆర్

Related Posts
IPL2025: పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌కు జరిమానా
IPL2025: పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌కు జరిమానా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కు బీసీసీఐ భారీ Read more

గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్: సీఎం
గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్: సీఎం

దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) సదస్సులో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ను గూగుల్ క్లౌడ్ వంటి సాంకేతిక సంస్థలకు వ్యూహాత్మక కేంద్రంగా Read more

Vikram: ఓటీటీలోకి రాబోతున్న ‘వీర ధీర శూరన్’
Vikram: ఓటీటీలోకి రాబోతున్న 'వీర ధీర శూరన్'

తమిళ స్టార్ హీరో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వీర ధీర శూరన్' మార్చి 27, 2025న థియేటర్లలో విడుదలైంది. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన Read more

మన్మోహన్‌కు స్మారకమా..? ప్రణబ్ కుమార్తె విమర్శలు
pranab mukherjee daughter

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×