మరోసారి జగన్ ఓదార్పు యాత్ర..?

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్ర చేసి..విజయం సాధించిన జగన్..ఇప్పుడు ఓటమి తర్వాత మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఇటీవల పార్టీ క్యాడర్‌పై జరుగుతున్న దాడుల్లో బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. త్వరలోనే వారిని పరామర్శించి, భరోసా కల్పిస్తానని నేతలతో చెప్పినట్లు సమాచారం.

ఓటమితో కుంగిపోయిన వైసీపీ శ్రేణులను ఉత్తేజపరచడానికి, వారిలో ఉత్సాహం నింపడానికి జగన్ యాత్ర చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇక కౌంటింగ్‌లో టీడీపీ కూటమి విజయం సాధించిన తర్వాత పలుచోట్ల వైసీపీ శ్రేణుల మీద, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులకు అండగా నిలబడాలని జగన్ నిర్ణయించుకున్నారు.