జగన్ కు మరో షాక్..వైఎస్ భారతి పీఏ అరెస్ట్..?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు ఇస్తుంది కూటమి సర్కార్. శనివారం ఉదయం తాడిపల్లి లో నిర్మాణం లో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసింది. అక్రమంగా ఈ నిర్మాణం ఉందంటూ కూల్చడం జరిగింది. ఇదిలా ఉండగానే జగన్ భార్య భారతి పీఏ పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనితలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది.

పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకరమైన కామెంట్స్ చేసినట్లు తెలిసింది. చంద్రబాబు, పవన్ కుటుంబసభ్యులపై సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు సమాచారం. వరుస ఆరోపణల నేపథ్యంలో వైఎస్ భారతి పీఏ రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ వరుస ఆరోపణల నేపథ్యంలో… వైయస్ భారతి వ్యక్తిగత సహాయకుడు రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతుంది. కడప నుంచి కదిరి వెళ్లే మార్గమధ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.