You give promises..we will fulfill them.. CM Rekha Gupta

Delhi: మీరు హామీలు ఇస్తారు..మేము వాటిని నెరవేరుస్తాము: సీఎం రేఖా గుప్తా

Delhi: ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల డబ్బుతో ఆయన శీష్‌ మహల్‌ కట్టారంటూ ఆరోపించారు. ఆప్‌ ప్రభుత్వం ప్రజల ధనాన్ని దోచుకుంది. సీఎం నివాసం మరమ్మతుల పేరిట కేజ్రీవాల్‌ రూ. 45 కోట్లు ఖర్చు చేశారు. ఢిల్లీని లండన్‌గా మారుస్తానని ట్రాఫిక్‌ జామ్‌లకు నిలయంగా మార్చేశారు. వారు చేపట్టిన ప్రాజెక్ట్‌లను అసంపూర్తిగా వదిలేశారు.

Advertisements
మీరు హామీలు ఇస్తారు మేము

మా ప్రభుత్వం వాటిని నేరవేరుస్తుంది

ఆప్‌, బీజేపీకి మధ్య చాలా తేడాలున్నాయి. మీరు (ఆప్‌ను ఉద్దేశిస్తూ) వాగ్దానాలు చేస్తారు. కానీ, మా ప్రభుత్వం వాటిని నేరవేరుస్తుంది. మీరు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో కలిసి అవినీతికి పాల్పడ్డారు. మేము మాత్రం కలిసి కట్టుగా దేశాభివృద్ధి కోసం పని చేస్తున్నాం. మీరు ప్రజల సొమ్ముతో శీష్ మహల్‌, బంగారు టాయిలెట్లు కట్టుకున్నారు. బీజేపీ సర్కారు పేదల కోసం ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది అని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు.

పర్యాటక కేంద్రంగా ఢిల్లీ అభివృద్ధి

ఢిల్లీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని.. అందుకు ప్రణాళికలను రచిస్తోందని సీఎం తెలిపారు. ఇందుకు రూ. 177 కోట్లను కేటాయించామని వెల్లడించారు. దీనిలో భాగంగా శీష్‌మహల్‌ను చూసేందుకు ప్రజలను అనుమతిస్తాం అని రేఖా గుప్తా పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గద్దె దించి బీజేపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

Related Posts
దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు
Chandrababu Naidu is the richest Chief Minister in the country

న్యూఢిల్లీ: దేశంలోనే ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. అసోసియేషన్‌ Read more

నేడు ప్రవాసీ భారతీయ అవార్డులను ప్రదానం
నేడు ప్రవాసీ భారతీయ అవార్డుల ప్రదానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఒడిశాలో నిర్వహిస్తున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు ముగింపు సమావేశంలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం Read more

317 జీవోలో సవరణ – సీఎస్ శాంతి కుమారి
telangana 317 go

317జీవో బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కోసం వెబ్ పోర్టల్ Read more

Pahalgam Attack: పాకిస్థాన్‌ జాతీయ భద్రతా కమిటీ సమావేశం
పాకిస్థాన్‌ జాతీయ భద్రతా కమిటీ సమావేశం

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, భారత్‌ చర్యలను "తొందరపాటు" మరియు "అపరిపక్వమైనవి" అని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×