YogiAdityanath:బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్న యోగి ఆదిత్యనాథ్​

YogiAdityanath:బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్న యోగి ఆదిత్యనాథ్​

యోగి ఆదిత్యనాథ్ తన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ మరోసారి సమర్థించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు, వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పడం సరైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.

Advertisements

బుల్డోజర్ న్యాయం పై వ్యాఖ్యలు

“న్యాయాన్ని నమ్మేవారికి న్యాయం జరుగుతుంది. కానీ, కొందరు స్వయంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, వారికి చట్టం పరిధిలోనే సమాధానం చెప్పాలి. ఏ విధంగా అర్థమవుతుందో, ఆ భాషలోనే వారికి అర్థమయ్యేలా చేయాలి” అని సీఎం యోగి స్పష్టం చేశారు. ‘బుల్డోజర్ న్యాయం’ పేరిట అక్రమ కట్టడాలను కూల్చడంపై ఆయన తమ వైఖరిని సమర్థించారు.

ఓటు బ్యాంకు

దేశంలో ముస్లింలు ప్రమాదంలో లేరని, వారి ఓటు బ్యాంకు రాజకీయమే ప్రమాదంలో పడిందని సీఎం యోగి విమర్శించారు. “భారతదేశంలో హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే ముస్లింలు సురక్షితంగా ఉంటారు. గతంలో కశ్మీర్‌లో ఏమి జరిగిందో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎలా జరుగుతున్నాయో మనకు తెలుసు. పాకిస్థాన్‌లో హిందువుల సంఖ్య ఏ విధంగా తగ్గిపోతోందో కూడా అందరికీ స్పష్టంగా తెలుసని యోగి పేర్కొన్నారు.

cm yogi news 295552761 16x9

ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం యోగి సంబల్ ప్రాంతంలోని ఆలయాల తవ్వకంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సంభల్‌లో అన్ని చోట్ల తవ్వకాలు చేపట్టి ఆలయాలను గుర్తిస్తాం. ఎన్ని ఉంటే అన్ని వెలికి తీస్తాం. ప్రపంచం మొత్తం దేవుడు ఇచ్చిన కళ్లతో ఈ ప్రాంతంలో జరిగిన నిజాలను చూడాలి” అని అన్నారు.

హిందువుల జనాభా

భారతదేశంలో ఇస్లాం ప్రమాదంలో ఉందని మాట్లాడేవారు, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిని కూడా ఒకసారి గమనించాలి. 1947కు ముందు ఈ దేశాలు భారత్‌లో భాగంగా ఉండేవి. కానీ, విభజన తర్వాత అక్కడి హిందువులు హింసను ఎదుర్కొన్నారు. ఆ దేశాల్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయింది అని అన్నారు.యోగి అదిత్యనాథ్ మాట్లాడుతూ, “ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ఏడేళ్లుగా ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదు. ఇది మా ప్రభుత్వ నిబద్ధతను సూచించే విషయం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది,అని ఆయన అన్నారు.

Related Posts
ల‌తా ర‌జ‌నీకాంత్‌కు ప్రధాని మోడీ ఫోన్.. రజనీకాంత్‌ ఆరోగ్యంపై ఆరా..!
pm modi enquiries with wife latha about rajinikanth health

pm-modi-enquiries-with-wife-latha-about-rajinikanth-health న్యూఢిల్లీ: ద‌క్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. గుండెకు రక్తం Read more

Earthquake : మయన్మార్‌కు భారత్ సాయం.. 15 టన్నుల సహాయ సామగ్రి తరలింపు
India aid to Myanmar.. 15 tons of relief materials transported

Earthquake: భారీ భూకంపంతో అతలాకుతలం అయిన మయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి Read more

IPL2025: పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌కు జరిమానా
IPL2025: పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌కు జరిమానా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కు బీసీసీఐ భారీ Read more

రణ్వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు ఆగ్రహం
రణ్వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు ఆగ్రహం

'ఇండియాస్ గాట్ టాలెంట్ (IGL) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..? మీ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×