చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. ‘చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ దావోస్ వెళ్లి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఇన్నేళ్లలో ఒక్క అటుకుల మిల్లు, అప్పడాల మెషిన్ కూడా రాలేదు. తండ్రీకొడుకులు ప్రజా ధనంతో షికార్లు చేసి వస్తారు. జగన్ తన హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి’ అని వైసీపీ ట్వీట్ చేసింది.
వైసీపీ హయాంలో జగన్ స్వయంగా దావోస్ పర్యటనకు వెళ్లి, లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను సాధించారని, ఈ ఒప్పందాలు రాష్ట్రానికి అభివృద్ధి కలిగించాయని వైసీపీ చెప్పుకొచ్చింది. గన్ పర్యటనలపై విమర్శలు లేకుండా, బలమైన ఆర్థిక ఒప్పందాలు సాధించినట్లు వైసీపీ తెలిపింది. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన ఒప్పందాలు సాధించామని ,ఎన్నో విజయాలు సాధించామని పేర్కొన్నారు. వైసీపీ చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తుంది. వైసీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా..ఉన్న కంపెనీ లు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని కౌంటర్లు స్టార్ట్ చేసారు.