వైసీపీకి ఏడుగురు ఎంపీల గుడ్ బై..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుసపెట్టి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు పార్టీ వీడగా.. మరికొందరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఏడుగురు YCP రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, R.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు పార్టీ వీడుతున్నట్లు సమాచారం. వీరందరూ రాజీనామా చేస్తే వైసీపీకి మిగిలేది మరో నలుగురు MPలే. ఈరోజు మోపిదేవి, మస్తాన్ రావు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్ కు సమర్పించనున్నారు.