కర్నూలు జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య

కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడును దుండగులు రాళ్లతో కొట్టి, నరికి అతి దారుణంగా హత్య చేసారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపిస్తుంది. ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా పని చేయడంతోనే సుబ్బారాయుడిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అనుచరుడు. ఈ క్రమంలో గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బ తినకుండా పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు.