పుంగనూరులో వైసీపీకి భారీ షాక్

ఏపీలో వైసీపీ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వరుస పెట్టి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వస్తున్నారు. ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున నేతలు బయటకు రాగా..ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం తో చిన్న చితక నేతలు సైతం వైసీపీ కి బై బై చెపుతున్నారు.

తాజాగా పుంగనూరు లో వైసీపీ కౌన్సిలర్లు భారీగా షాకిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో సహా సుమారు 17మంది కౌన్సిలర్లు టిడిపి పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని కలిసి టీడీపీ పార్టీలో చేరారు. ఇంకా సర్పంచులు, ఎంపీటీసీలు మిగిలిన కౌన్సిలర్లు సైతం పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.