మూఢనమ్మకం యువతీ ప్రాణాలు పోయేలా చేసింది

దేశం రోజు రోజుకు ఎంతగా అభివృద్ధి చెందుతుందో తెలియంది కాదు..సరికొత్త టెక్నాలజీ తో అభివృద్ధి లో దూసుకుపోతుంటే..మారుమూల గ్రామాల్లో మాత్రం కొంతమంది ప్రజలు మూఢనమ్మలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మూఢనమ్మకం ఓ యువతీ ప్రాణాలు పోయేలా చేసింది.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని న్యూ సోమార్‌పేట్ గ్రామంలో సిడాం లక్ష్మి(26)కి నెలసరి అయింది. అయితే, ఆదివాసి ఆచారం ప్రకారం.. అమ్మాయికి నెలసరి వస్తే కుప్పిలో పడుకోబెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే లక్ష్మి కూడా ఇంటి బయటకు కుప్పిలో పడుకుంది. అయితే, నిద్ర మత్తులో ఉన్న ఆమెను పాము కాటేసింది. నిద్ర మత్తులో ఉన్న ఆమె పాముకాటును పట్టించుకోకపోవడంతో ఉదయం లేచి చూసేసరికి తీవ్రమైన నొప్పితో కాలు వాయడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఒళ్లంతా విషం పాకడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.