Bengaluru: తల్లితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

Bengaluru: తల్లితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర హత్య సంచలనం రేపింది. రహస్యంగా వివాహం చేసుకున్న భర్తను, తన తల్లి సహాయంతో, భార్యే హత్య చేయడం కలకలం రేపింది. మార్చి 22న సాయంత్రం, నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి ఉంచిన కారులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, అతడి గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది.హత్యకు గురైన వ్యక్తిని 37 ఏళ్ల లోక్‌నాథ్ సింగ్‌గా గుర్తించారు. అతను బెంగళూరులో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా, అలాగే లోన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మొదట్లో ఈ హత్యకు వ్యక్తిగత విభేదాలా, ఆర్థిక వివాదాలా కారణమా అని పోలీసులు అనుమానించారు. కానీ, దర్యాప్తు కొనసాగించగా అసలు నిజం బయటికొచ్చింది.

Advertisements

హత్య

మార్చి 22న యశస్విని, లోక్‌నాథ్‌ను బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కు రావాలని కోరింది. ఆమె తల్లి 37 ఏళ్ల హేమా బాయి కూడా ఆటోలో రెస్టారెంట్‌ వరకు వచ్చి వారిని ఫాలో అయ్యింది. అక్కడ భోజనం చేసిన లోక్‌నాథ్ తిన్న ఫుడ్‌లో నిద్రమాత్రలు కలిపారు.తర్వాత, అతడిని కారులో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. నిద్రమాత్రల ప్రభావంతో మగతలో ఉన్న లోక్‌నాథ్‌ను, యశస్విని హేమా బాయి కలిసి అతని గొంతు కోసి హత్య చేశారు. హత్య అనంతరం వారు సంఘటన స్థలం నుంచి పారిపోయారు.

రహస్య వివాహం

లోక్‌నాథ్‌కు 21 ఏళ్ల యశస్వినితో రెండేళ్లుగా రహస్య సంబంధం కొనసాగింది. 2024 డిసెంబర్‌లో ఈ ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, ఈ విషయం యశస్వినికి ఇంట్లో తెలియకుండా ఆమెను పుట్టింట్లోనే ఉంచాడు.అయితే, ఇటీవల ఈ వివాహ విషయం యశస్విని కుటుంబానికి తెలిసిపోయింది. అలాగే అతడికి వివాహేతర సంబంధాలున్నాయని, అనుమానాస్పద వ్యాపార లావాదేవీలు చేస్తున్నాడని అనుమానించారు.ఈ నేపథ్యంలో, అతడిని తమ జీవితంలో నుంచి తొలగించాలని యశస్విని తన తల్లితో కలిసి పథకం వేసింది.

bengaluru woman kills husband with mothers help 252836743 16x9 0

పోలీసుల దర్యాప్తు

హత్య జరిగిన అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి, నిందితులైన యశస్విని, ఆమె తల్లి హేమా బాయిని అరెస్ట్ చేశారు. విచారణలో ఈ హత్యకు వారు కుట్ర చేసినట్లు అంగీకరించారు.

లోక్‌నాథ్‌పై మోసం కేసు

హత్యకు గురైన లోక్‌నాథ్‌పై మోసం కేసు నమోదై ఉందని పోలీసులు తెలిపారు. అతను ఏదైనా అక్రమ లావాదేవీల్లో పాల్గొన్నాడా? ఇతరత్రా వివాదాల్లో ఇరుక్కున్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Posts
Narendra Modi:దేశ ఐక్యతను దెబ్బతీసే వారి కుట్రలను సాగనివ్వబోమన్న ప్రధాని
narendra modi

దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలులోకి రాకుండా తమ ప్రభుత్వం కట్టుబాటుగా Read more

Lulu Group : అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Lulu Group అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

Lulu Group : అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత టీవీ9 నెట్‌వర్క్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే' మూడవ ఎడిషన్ మార్చి 28న Read more

అసలునిజం బయట పెట్టిన U.శ్రీనివాసరావు దీనికంతటికి కారణం ఒక అమ్మాయి – రాజమౌళి & యు.శ్రీనివాసరావు
SS రాజమౌళి వివాదం – అసలు ఏమి జరిగింది?

యు.శ్రీనివాసరావు రాసిన డెత్ లెటర్ వివరణ యు.శ్రీనివాసరావు. అనే నేను నాకు రాజమౌళికి 36 ఏళ్లుగా స్నేహం ఉంది , అందరి జీవతల్లాగా మా జీవితం లో Read more

ఢిల్లీ బొమ్మలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే
ఢిల్లీ బొమ్మలపై .డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే

దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. ఈ శకటంలో ఏటికొప్పాక బొమ్మలు ఉన్న విషయం డిప్యూటీ సీఎం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×