పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో ఉగ్రవాద నాయకుల సమావేశం జరిగింది ఈ భేటీలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) లష్కరే-ఎ-తోయిబా (LeT) అగ్ర కమాండర్లు అలాగే హమాస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం పాకిస్తాన్ మరియు ప్రపంచ ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఫిబ్రవరి 5 న పాకిస్తాన్ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈసారి ఈ కార్యక్రమం అతి ప్రత్యేకంగా మారింది, ఎందుకంటే హమాస్ అగ్రనేతలు పాక్లోని రావల్కోట్లోని సబీర్ స్టేడియంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.
“అల్ అక్సా ఫ్లడ్స్” పేరిట ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది ఇందులో జైష్, లష్కరే-తోయిబా, హమాస్ అగ్రనేతలు పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 5 న కాశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ రోజు భారత్ వ్యతిరేక ఎజెండాను ప్రపంచానికి తెలియజెప్పే అవకాశం పాకిస్తాన్ తీసుకుంటుంది. కానీ ఈసారి హమాస్ అగ్రనేతలను ఆహ్వానించి పాక్ ఉగ్రవాద సంస్థలతో తమ సంబంధాలను మరింత బలపరిచింది. ఈ సమావేశంలో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తొయిబా, హమాస్ నాయకులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రత్యేకంగా మరొక విషయం కూడా ఉంది ఎందుకంటే హమాస్ సంస్థ అగ్రనేతలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను సందర్శించడం ఇది మొదటిసారి.
ఇంతకీ హమాస్ ఏకంగా పాకిస్తాన్ వేదికను పంచుకోవడం ఈ సందర్భంగా సంచలనం సృష్టిస్తోంది.పాక్కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్, జైష్ కమాండర్లు అస్గర్ఖాన్ కశ్మీరీ మసూద్ ఇలియాస్, లష్కరే-తొయిబా, హమాస్ నేత డాక్టర్ ఖలీద్ అల్-ఖదౌమీ ఈ సమావేశంలో హాజరయ్యారు. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి బహిర్గతం చేస్తూ హమాస్ నాయకులను ఆహ్వానించి వారి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ఉంది. దీనికి తోడు, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రపంచానికి తెలియజేస్తోంది. హమాస్ సేనతో కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇకపై భారత్కు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామం పాక్ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాన్ని మరింత బలపరుస్తోంది. పీవోకేలో హమాస్ ఉగ్రవాదులను ఆశ్రయించడం, సమీక్షించాల్సిన అంశంగా మారింది. వర్గాలు ఈ భేటీని గమనించి కేంద్ర ప్రభుత్వం గట్టి సెక్యూరిటీ చర్యలు తీసుకున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ టీమ్లు కశ్మీర్ లో వాహన తనిఖీలు మరింత కఠినంగా చేస్తోంది.