అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్వగ్రామం తాడిపత్రికి వచ్చేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేసుకోగా.. అందుకు పోలీసులు అనుమతించని పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో కేతిరెడ్డిని గృహనిర్బంధం చేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… ‘‘తాడిపత్రిలో నా ఇంటికి పోలీసులు నన్ను వెళ్ళనివ్వడం లేదు. వేరే దేశానికి వెళ్లాలంటే వీసా కావాలి. తాడిపత్రి కి వెళ్ళాలంటే వీసా ఏమైనా తీసుకోవాలా. పోలీసులు వీసా ఆఫీస్ చెప్పితే అక్కడికి వెళ్లి అప్లై చేసుకుంటా’’ అంటూ ఎద్దేవా చేశారు.

తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో అమాయకులను బెదిరింపులకు గురి చేసి, వారిపై దాడులు చేస్తూ ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.