Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్‌ ఎక్కడంటే?

Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్‌ ఎక్కడంటే?

ఏపీలో రైలు, రోడ్ల ప్రాజెక్టుల పనుల్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణను, హైదరాబాద్‌ను కనెక్ట్ చేస్తూ చేపట్టిన నడికుడి – శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ పనులు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దర్శి, పొదిలి వరకు రైల్వే లైన్ పనులు ముగింపు దశకు వచ్చాయి. ప్రస్తుతం కనిగిరి వరకు రైల్వే పనుల్లో స్పీడ్ పెంచారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే పనులను వేగవంతం చేయాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి సూచించారు. ఆగస్టులో రైల్వే లైన్ ప్రారంభం కావాల్సి ఉండటంతో ఎమ్మెల్యే ఆ పనుల పురోగతిని సమీక్షించారు. కలగట్ల దగ్గర రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కనిగిరి నియోజకవర్గంలో మూడు రైల్వే స్టేషన్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు.కనిగిరి లో కొత్త రైల్వే లైన్‌ ప్రారంభం.

Advertisements

రైల్వే లైన్

కలగట్ల దగ్గర రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలో యడవల్లి, కనిగిరి, గార్లపేట స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, కవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌ఫాంలు, వెయిటింగ్ హాల్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.ఈ పనులపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌లలో మహిళలకు ప్రత్యేక వెయిటింగ్ రూములు, ఏసి ప్రయాణికుల కోసం గదులు, సాధారణ ప్రయాణికులకు అనుకూలమైన వసతులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇటీవల కనిగిరికి వచ్చిన మంత్రి నారా లోకేష్ ఆగస్టులో రైల్వే లైన్ ప్రారంభిస్తామని చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లు, తహసీల్దార్ రవిశంకర్ ఈ పనుల్ని పరిశీలించారు.

 Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్‌ ఎక్కడంటే?
Newrailcorridor

మరికొన్ని

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రకాశం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కోరిక ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం (దర్శి, కనగిరి, పొదిలి)లో ప్రజలు ఈ రైలు మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పనులు ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్నాయి, కనిగిరి, పామూరు మీదుగా ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో పనులు వేగవంతం చేయనున్నారు. అటు నుంచి తిరుపతి జిల్లా పరిధిలోకి రైల్వే లైన్ వెళుతుంది. శ్రీకాళహస్తి దగ్గర ముగియనుంది. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ వైపు నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వైపు నుంచి తిరుపతికి వెళ్లాలంటే మూడు రూట్‌లు ఉన్నాయి. హైదరాబాద్ టూ తిరుపతి వయా ఖాజీపేట, విజయవాడ, నెల్లూరు హైదరాబాద్ టూ తిరుపతి వయా నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు హైదరాబాద్ టూ తిరుపతి వయా మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్ రూట్లు ఉన్నాయి. ఈ మూడు రూట్లతో పోలిస్తే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌తో దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. మరికొన్ని రైళ్లను కూడా నడిపేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Andhra Pradesh: విశాఖలో కొత్తగా మూడు ప్రభుత్వ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్స్‌

Related Posts
కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్
కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్

సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టే వారికి తగినంత హెచ్చరికలు, కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు లక్ష్యంగా మారుతున్నారు. తాజాగా, Read more

YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్టు ..హైదరాబాద్‌కు తరలింపు
YS Sharmila విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్టు ..హైదరాబాద్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు YS Sharmila మరోసారి వార్తల్లోకెక్కారు.బుధవారం ఆమెపై విజయవాడ పోలీసులు అరెస్టు విధించారు.గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తరలించారు.ఇది సడన్ అరెస్టు కాదు.షర్మిల Read more

Banana Farmers : అరటి రైతులకు రూ.1.10 లక్షలు – అచ్చెన్న
banana farmers

ఆంధ్రప్రదేశ్‌లో వడగండ్ల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు Read more

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ
యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ

స్పా సెంటర్ నిర్వాహణ.. విజయవాడ: యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ.వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు నందు గల స్టూడియో 9,( స్పా) పై సిబ్బందితో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×