అక్కినేని యువహీరో అఖిల్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు పొందిన అఖిల్ త్వరలోనే వైవాహిక జీవితం ప్రారంభించబోతున్నాడు. ఇటీవల జైనాబ్ రవడ్జీ అనే యువతితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో గోప్యతతో జరిగింది. ఈ హ్యాపీ న్యూస్ను స్వయంగా నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అఖిల్, జైనాబ్ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ, వారి నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు.

దీంతో అక్కినేని ఫ్యామిలీ అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది.తాజా సమాచారం ప్రకారం, అఖిల్-జైనాబ్ల వివాహం మార్చి 24న జరగనుందని తెలుస్తోంది.ఇరు కుటుంబాలు ఇప్పటికే వివాహ తేదీని ఖరారు చేశాయి. ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నాగార్జున ప్రత్యేకంగా ప్రణాళికలు వేస్తున్నారని సమాచారం. ఈ అట్టహాసమైన పెళ్లి వేడుకకు టాలీవుడ్, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. సినీ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు కూడా ఈ పెళ్లికి హాజరుకానున్నారు. వివాహం గురించి వార్తలు వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.గతంలో అఖిల్ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని, అనంతరం దానిని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు జైనాబ్తో పెళ్లికి అన్ని సిద్ధమవుతున్నాయని సమాచారం.
ఇటీవలే నాగచైతన్య-శోభితల వివాహం గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖిల్ పెళ్లి వేడుకతో మరోసారి అక్కినేని ఇంట సందడి మొదలవుతోంది. పెళ్లి తేదీ దగ్గరపడుతున్నకొద్దీ అభిమానుల ఆనందం మరింత పెరుగుతోంది.ఈ పెళ్లి అట్టహాసంగా జరిగి, సినీ ఇండస్ట్రీలో భారీ చర్చకు కారణమవుతుందని అనిపిస్తోంది. అఖిల్ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.