ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన అన్వేష్, “నా అన్వేషణ” అనే యూట్యూబ్ సిరీస్తో అనేక మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్ అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడీ ఫేమస్ యూట్యూబర్. లోకల్ బాయ్ నాని మొదలు మొన్నటి నటుడు అలీ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆధారాలతో సహా వీడియోలు రిలీజ్ చేశాడీ గ్లోబల్ టూరిస్ట్. అదే సమయంలో కొందరు సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు అన్వేష్. ఇప్పుడిదే కారణంతో మరోసారి చిక్కుల్లో పడ్డాడీ ప్రపంచ యాత్రికుడు. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడంటూ అతనిపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు అన్వేష్. అయితే ఇది అవాస్తవ, తప్పుడు సమాచారమంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ప్రకటనలు
‘ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా అన్వేష్ వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా అన్వేష్ అవాస్తవ ప్రకటనలు చేశాడు . తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి’ అని సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్వేష్పై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసు విషయంపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

యాప్స్
కాగా గత కొన్ని నెలల నుంచి బెట్టింగ్ యాప్లపై పోరాటం చేస్తున్నాడు అన్వేష్. ఈ యాప్ లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోన్న పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను ఆధారాలతో సహా బయట పెట్టాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు కూడా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న వారిపై కేసులు కూడా నమోదు చేశారు.
Read Also: Alekhya Reddy : ఎమ్మెల్సీ కవితతో తనకున్న స్నేహంపై నందమూరి అలేఖ్య పోస్టు