GST telugu states

GST : తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ కలెక్షన్లు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 ఏప్రిల్ నెలలో రూ.3,354 కోట్లు జీఎస్టీ వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇది 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాతి కాలంలో ఏపీలో నమోదైన అత్యధిక వసూళ్లుగా గుర్తింపు పొందింది. ఈ వృద్ధిని చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ప్రయాణిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ లో గతంతో పోలిస్తే 12శాతం వృద్ధి

తెలంగాణ రాష్ట్రం కూడా జీఎస్టీ వసూళ్లలో మంచి ప్రగతిని చూపింది. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 12శాతం వృద్ధి నమోదు చేసి మొత్తం రూ.6,983 కోట్ల ఆదాయాన్ని జీఎస్టీ రూపంలో పొందింది. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు, వినియోగం పెరుగుతున్న దానికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ వృద్ధితో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఊపిరి పోసినట్టయింది.

దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు అత్యధికం

ఇక దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా నమోదు కావడం మరో ముఖ్యాంశం. ఏప్రిల్ 2025లో మొత్తం జీఎస్టీ కలెక్షన్లు రూ.2.37 లక్షల కోట్లకు చేరాయి. ఇది ఇప్పటివరకు దేశంలో నమోదైన గరిష్ఠంగా గుర్తింపు పొందింది. దీనికి గల ముఖ్య కారణాలు, మెరుగైన టాక్స్ కంప్లయెన్స్, డిజిటల్ చెల్లింపులు, వ్యాపార కార్యకలాపాల్లో ఊపుమీదున్న వృద్ధి అని అధికారులు తెలిపారు.

Read Also : Jagan : చంద్రబాబుపై జగన్ నిప్పులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×