Welspun Foundation for Health & Knowledge, fostering leadership and scientific curiosity in Telangana

శాస్త్రీయ ఉత్సుకతను పెంపొందిస్తోన్న వెల్‌స్పన్ ఫౌండేషన్

హైదరాబాద్ : వెల్‌స్పన్ ఫౌండేషన్ ఫర్ హెల్త్ & నాలెడ్జ్, ఇటీవల తెలంగాణలో నాయకత్వ నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటుగా శాస్త్రీయ ఉత్సుకతను ప్రోత్సహించడానికి రెండు ప్రభావవంతమైన కార్యక్రమాలను శివశ్రీ ఛారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి నిర్వహించింది.

కన్హా శాంతివనంలో జరిగిన రెండు రోజుల రెసిడెన్షియల్ శిక్షణలో గ్రామ సమన్వయకర్తలు మరియు మండల సమన్వయకర్తలు సహా 25 మంది ఫీల్డ్ టీమ్ సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టారు. ఈ సెషన్లలో ప్రభావవంతమైన నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్, బృందంగా కలిసి పనిచేయటం సహా , ఆకర్షణీయమైన కార్యకలాపాలు మరియు బృంద ఆటలు ఉన్నాయి. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నవారు హార్ట్‌ఫుల్‌నెస్ బృందం నిర్వహించిన ధ్యాన కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు, ఇది వారి మొత్తం అనుభవాన్ని మెరుగుపరిచింది.

image

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒకరు మాట్లాడుతూ .. “ఈ శిక్షణ కార్యక్రమం సరికొత్త గా ఉండటం తో పాటుగా సుసంపన్నమైన అనుభవంగా నిలిచింది. ఆశ్రమంలోని ప్రశాంతమైన వాతావరణంతో నేర్చుకునే అద్భుతమైన అభ్యాస అనుభవంగా మార్చింది” అని అన్నారు. డిసెంబర్ 10, 2024న, షాబాద్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలుర)లో మెగా సైన్స్ ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడు ప్రభుత్వ పాఠశాలలు భాగమయ్యాయి . ఈ ఫెస్ట్ లో 522 మంది విద్యార్థుల సృజనాత్మకత మరియు బృంద కృషిని పెంపొందించే సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) శ్రీమతి అపర్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పలువురు స్థానిక అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్థులందరికీ వారి శాస్త్రీయ ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించడానికి బహుమతులు అందజేశారు. నాయకత్వం మరియు శాస్త్రీయ అభ్యాసాన్ని ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా సమాజ సాధికారతకు వెల్‌స్పన్ ఫౌండేషన్ అంకితం చేయబడింది, ఇది తెలంగాణలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

Related Posts
మద్యం ధరల పెంపు పై సీఎం రేవంత్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరల పెంపు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎక్సైజ్ అధికారులకు లిక్కర్ కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని ఆయన Read more

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి
Vemireddy couple meet CM Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వేమిరెడ్డి Read more

గ్రూప్-2 అభ్యర్థులకు ముఖ్య ప్రకటన
Alerts

గ్రూప్‌ 2 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా Read more

Ilaiyaraaja : ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Ilaiyaraaja ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Ilaiyaraaja : ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ ఇటీవల లండన్‌లో చారిత్రాత్మకంగా 'వాలియెంట్' సింఫనీ ప్రదర్శించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, నేడు దేశ ప్రధాని Read more