We will stand by the victim's family members.. Nadendla Manohar

Nadendla Manohar : బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar : ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో మాజీ మంత్రి సామినేని ఉదయభానుతో కలిసి ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌లో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టామని మనోహర్‌ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు తామంతా అండగా ఉంటామన్నారు.

Advertisements
బాధిత కుటుంబ సభ్యులకు అండగా

భారత పౌరులంతా ప్రధాని మోడీకి అండగా నిలవాలి

ఈ సమయంలో భారత పౌరులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలవాలన్నారు. జనసేన పక్షాన కొవ్వొత్తుల ర్యాలీ, మౌన దీక్షలు, ఇవాళ మానవహారం నిర్వహించామని మనోహర్‌ వెల్లడించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు, కుల, మతాలు చూడవద్దని, భారతీయులుగా మనవాళ్లకు అండగా నిలవాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సాయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఎంతటి బాధ ఉన్నా ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కావలిలో జనసేన నేత మధుసూదన రావు భౌతికకాయాన్ని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారని నాదెండ్ల పేర్కొన్నారు. జరిగిన దుర్ఘటన గురించి ఆయన భార్య చెబుతుంటే కన్నీరు ఆగలేదన్నారు.

Read Also:  ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి

Related Posts
ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే : హరీశ్ రావు ట్వీట్
Harish Rao Questions CM Revanth Reddy

రేవంత్ రెడ్డి ఈ రైతుకు ఏం జవాబిస్తారు? హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. నాంపల్లిలోని గాంధీ భవన్ Read more

వైఎస్ షర్మిలతో, విజయసాయిరెడ్డి భేటీ?
వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

రాజకీయాల్లోకి దూరంగా వెళ్ళిపోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు మరొక కొత్త సంచలనం సృష్టించారు. మూడు రోజుల క్రితం, ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ షర్మిల నివాసానికి Read more

మొబైల్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
మొబైల్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

సమాజంలో మారుతున్న జీవనశైలి, టెక్నాలజీపై పెరుగుతున్న ఆధారపడటంతో చిన్న వయస్సులోనే పిల్లలు సెల్‌ఫోన్లపై మోజుపడుతున్నారు.కొన్ని కుటుంబాలు తీరని విషాదాన్ని ఎదుర్కొంటున్నాయి.ఇలాంటి ఓ విషాద ఘటన అనంతపురం జిల్లా Read more

India- Pak War : భారత్ – పాక్ ఉద్రికత్తలు మధ్య ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన
United Nations

జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×