ఈ నెలాఖరుకు అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం: మంత్రి నారాయణ

We will reopen Anna canteens by the end of this month: Minister Narayana

అమరావతి: ఈ నెలాఖరుకు 203 అన్నా క్యాంటీన్లను పూర్తిస్థాయిలో పునఃప్రారంభిస్తామని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ. నెల్లూరు జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ మాట్లాడుతూ….ఈ రోజు తెల్లవారుజామున నుండే రాష్ట్రంలో 68 లక్షల 64 వేల మందికి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది..రూ.3వేల నుండి రూ..4 వేలకు పెంచుతామని ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని తెలిపారు.

గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా.. అప్పులు చేసి పెట్టిందని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలను సైతం తాకట్టు పెట్టిందని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు పెరగాలని చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.. అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మున్సిపల్ శాఖలో ప్రజలు కట్టిన పన్నుల డబ్బులన్నిటినీ వాడేశారని తెలిపారు.