We will brighten the lives of fishermen.. CM Chandrababu

CM Chandrababu : మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం : సీఎం చంద్రబాబు

CM Chandrababu : మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరాట సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.20వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్లు మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.

మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం

న్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుంది

ఈ సందర్భంగా ఎచ్చర్ల నియోకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ వెళ్లినా.. ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ పని చేసిన వారు ఇక్కడి వారే. 26 జిల్లాలలో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే. ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదు. స్తానికుల సమస్యలు, పేదల కష్టాలను చూశాను. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయం పెంచాలని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

మత్సకారుల జీవితాల్లో సానుకూల మార్పులు

కాగా, ప్రభుత్వం మత్సకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాలు, మత్స్య వృద్ధి కేంద్రాలు, మరియు ఆర్థిక సహాయం పథకాలు, వారి ఆర్థిక స్వావలంబనను పెంచడానికి, మరియు వారి సామాజిక స్థాయిని మెరుగుపరచడానికి దోహదపడతాయి. ఈ చర్యలు మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, మరియు వారి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమైనవి.​ మత్సకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కట్టుబడి ఉంది. ఈ చర్యలు మత్సకారుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడానికి, మరియు వారి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి దోహదపడతాయి.

Read Also: కర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అరుదైన చికిత్స

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×