గన్నవరంలో రైల్వే ట్రాక్ పైకి నీరు..ట్రైన్స్ రద్దు

భారీ వర్షాలతో కృష్ణాజిల్లా గన్నవరం నిడమానూరు వద్ద రైలు పట్టాల పైకి వరద నీరు ప్రవహిస్తుండడం తో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా ఆ మార్గంలోని రైళ్లను రద్దు చేశారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఏకంగా ట్రాక్‌ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులను రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను రద్దు చేసింది. మరో 160 రైళ్లను దారిమళ్లించింది. మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.