వీరయ్య – సింహ రెడ్డి కలెక్షన్లను ఎత్తుకెళ్లిన దొంగలు

సంక్రాంతి బరిలో వచ్చిన వీరసింహ రెడ్డి , వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్స్ సాధించాయి. చాల కలం తర్వాత నందమూరి బాలకృష్ణ, మెగా స్టార్ చిరంజీవి బరిలోకి దిగడం, రెండు సినిమాలు సూపర్ హిట్స్ సాధించడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కలెక్షన్లు సైతం రికార్డు స్థాయి లో రావడం తో నిర్మాతలు , డిస్ట్రబ్యూటర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ థియేటర్ లో దొంగలు పడి వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల మూడు రోజుల కలెక్షన్లను ఎత్తుకెళ్లడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

సంక్రాంతి పండగ కావడంతో బ్యాంకులకు సెలవు ఉంది. రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్లను థియేటర్ల నిర్వాహకులు తమ వద్దే ఉంచుకున్నారు. బ్యాంకులు తిరిగి తెరుచుకున్న తర్వాత బ్యాంకులో వేయవచ్చని థియేటర్లలోని లాకర్లలో డబ్బు ఉంచారు. అయితే ఇదే అదనుగా చేసుకొని దొంగలు ఆ డబ్బును ఎత్తుకెళ్లారు. చోరీ విషయంపై వెంటనే థియేటర్ నిర్వాహకులు పొన్నూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని చోరీ ఎలా జరిగింది ఎవరు చేసి ఉంటారు థియేటర్ లో పని చేసే వారిలో ఎవరైనా దొంగలు ఉన్నారా థియేటర్ సిబ్బంది సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.