టాలెంటెడ్ యాక్ట్రెస్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి తన కలను బయటపెట్టారు. జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అవార్డు అందుకున్న రోజున తన నాయనమ్మ ఇచ్చిన ప్రత్యేకమైన చీరను ధరించాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కల అని, ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నారు.

నాయనమ్మ ఇచ్చిన గుర్తుగా
సాయిపల్లవి తన బాల్యం, కుటుంబ సంబంధాల గురించి చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో తన నాయనమ్మ ఇచ్చిన చీరకు ఉన్న ప్రత్యేకతను గుర్తుచేసుకున్నారు. “నాకు 21 ఏళ్లున్నప్పుడు మా నానమ్మ ఓ చీర ఇచ్చారు. ‘ఈ చీరను ఒక ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే కట్టు’ అని చెప్పింది. అందుకే, నా సినీ ప్రస్థానంలో అత్యంత గౌరవప్రదమైన అవార్డు అయిన జాతీయ అవార్డును అందుకునే రోజున దీన్ని ధరించాలని నిర్ణయించుకున్నా” అని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.
‘గార్గి’ సినిమాతో అంచనాలు
సాయిపల్లవి నటనకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆమె నటించిన ‘గార్గి’ సినిమా ప్రేక్షకులను మాత్రమే కాదు, విమర్శకులను కూడా మెప్పించింది. ఆ సినిమాలో ఆమె ఇచ్చిన ప్రదర్శనకు జాతీయ అవార్డు వస్తుందని అందరూ భావించారు. ఆమె ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అందర్నీ కదిలించగా, నేషనల్ అవార్డ్ కోసం ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, అనుకున్నట్లు అవార్డు రాకపోవడం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసింది.
సాయిపల్లవి కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. తన సహజమైన అభినయం, నమ్మకంగా నటించే తీరుతో సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జాతీయ అవార్డు కచ్చితంగా తన కెరీర్లో ఓ అద్భుతమైన మైలురాయి అవుతుందని ఆమె విశ్వాసంతో ఉన్నారు. త్వరలోనే ఆమె ఆశించిన అవార్డు అందుకుని, తన నాయనమ్మ ఇచ్చిన చీరను ధరిస్తారనే నమ్మకం ఫ్యాన్స్కు ఉంది.
ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూపు
సాయిపల్లవి జాతీయ అవార్డు సాధిస్తే, అది తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిశ్రమల కోసం గర్వించదగ్గ విషయమవుతుంది. ఆమె లాంటి అద్భుతమైన నటీనటుల కృషికి గుర్తింపు రావడం ఎంతో సంతోషకరం. సాయిపల్లవి అభిమానులు కూడా త్వరలోనే ఆమె కల నెరవేరాలని కోరుకుంటున్నారు. మున్ముందు ఆమె మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించి, తన ప్రతిభను చాటాలని ఆశిస్తున్నారు.