బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఎన్నిక
అమరాతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేత గా పి. విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ ఆదేశాల మేరకు విష్ణుకుమర్ రాజును ఎల్పీ లీడర్గా శనివారం ఎన్నుకున్నారు. 2014-19 మధ్య కూడా బీజేపీ ఎమ్మెల్యేగా చంద్రబాబు హయాంలో పనిచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. 2019-24 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రం దిగజారిపోయేలా పాలన జరిగిందని ఆరోపించారు. తనను కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని తెలిపారు. బిల్లులు చెల్లించకుండా గుత్తేదారులను వేధించారని విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల విజయం సాధించారు. అదే విధంగా టీడీపీ 144 స్థానాలకు గాను 134 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల గెలుపొందింది.