Visakhapatnam resident Chandramouli funeral complete with government honors

Terror Attack : ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి

Terror Attack : జమ్మూకశ్మీర్‌‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ హిందూ శ్మశాన వాటికలో చంద్రమౌళి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. చంద్రమౌళి అంత్యక్రియలో మంత్రులు, కూటమి నేతలు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రమౌళి అంతిమ సంస్కారాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వీడ్కోలు పలికారు. చంద్రమౌళి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisements
ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి

అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం

ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి గురువారం పరామర్శించారు. పాండురంగాపురంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన ఆయన.. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల పరిహారం చెక్కును చంద్రమౌళి కుటుంబసభ్యులకు అందజేశారు. అందమైన కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో నింపిందన్నారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు.

Read Also: ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు… ఈరోజు నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

Related Posts
Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు
Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు

తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో ప్రముఖంగా నిలిచిన యాత్రికుడు అన్వేష్ ప్రస్తుతం తీవ్రమైన వివాదానికి లోనయ్యాడు. ప్రపంచంలోని పలు దేశాలు సందర్శించి, అక్కడి సంస్కృతి, జీవనశైలి, ప్రత్యేకతలను తన Read more

అమెరికా పౌరసత్వంపై ట్రంప్ కామెంట్స్
వలసదారులను వెనక్కి పంపడం అమెరికాకే నష్టం: ఆర్ధిక వేత్తలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టుక ఆధారిత పౌరసత్వ (బర్త్ రైట్ సిటిజన్‌షిప్) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయంలో, ఈ చట్టం నిజానికి Read more

విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారు: బాలినేని
విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారు: బాలినేని

అమరావతి: వైస్‌ జగన్‌ మరియు వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ స్పందించాలని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం Read more

Tragedy : గోవాలో ఘోర విషాదం.. ఆరుగురు మృతి
goa

గోవా రాష్ట్రంలోని శ్రీగావ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన శ్రీదేవి లబ్రయీ ఆలయ జాతరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జాతర సందర్భంగా భారీగా భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×