Visakhapatnam Railway Zone.. Central Orders

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ : కేంద్రం ఉత్తర్వులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని కేంద్రం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.

image

విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబడిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410 కిలోమీటర్లుగా రైల్వే శాఖ నిర్ణయించింది. వాల్తేరులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైల్వే సెక్షన్లను విశాఖకు బదిలీ చేశారు. కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌కు, విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జాన్‌పాడ్ మార్గాలను సికింద్రాబాద్ డివిజన్‌కు మార్చింది. విశాఖ డివిజన్‌ పరిధిని కూడా తిరిగి నిర్ణయించింది. విశాఖ డివిజన్‌ పరిధిలో ఏ ఏ మార్గాలను కలిపేలా ఉన్నాయనే విషయం కూడా కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త జోన్ పరిధిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కూడా చేర్చబడ్డాయి.

132 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను కొనసాగిస్తోంది కేంద్రం. వాల్తేరును “విశాఖపట్నం డివిజన్” గా పునర్ నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ కేంద్రం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం విశాఖ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందన్నారు. ఈ 4 డివిజన్లతో విశాఖపట్నం రైల్వే మరింత బలోపేతం కానుంది. మెరుగైన మౌలిక వసతులు, రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ శ్రీభరత్ వివరించారు.

Related Posts
సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్
fake employees in the secre

హైదరాబాద్‌ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ Read more

బీజేపీకి నకిలీ ఓట్ల లక్ష్యాలు ఉన్నాయి: కేజ్రీవాల్
బీజేపీకి నకిలీ ఓట్ల లక్ష్యాలు ఉన్నాయి: కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, బీజేపీ 7 మంది ఎంపీలను నకిలీ ఓట్లు వేయమని అడిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. Read more

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రివ్యూ..
Srikakulam Sherlock Holmes Review

రేటింగ్: 3/5.. ప్రధాన నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ, రవిదర్శకుడు: రచయిత మోహన్నిర్మాత: రమణ రెడ్డిశ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్: వినూత్నతతో కూడిన భావోద్వేగాలకు మణికట్టుసారాంశం: శ్రీకాకుళం Read more

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 56 సంవత్సరాల తరువాత గయానాను సందర్శించారు
modi guyana

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం గయానాను సందర్శించి, 56 సంవత్సరాల తరువాత గయానా వెళ్లిన మొదటి భారత ప్రధాని అయ్యారు. ఆయన గయానా రాజధాని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *