పార్టీ మారడం ఫై క్లారిటీ ఇచ్చిన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ వైసీపీలో ఓ వెలుగు వెలిగి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి. ఇదే తరుణంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యే లు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ తరుణంలో ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి పార్టీ మరుతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండగా..దీనిపై విరుపాక్షి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ‘వైసీపీ టికెట్ ఫై గెలిచి టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. వైస్సార్ ఆశయాల కోసం జగన్ పట్టుదలను చూసి వైసీపీలో చేరాను. జగన్ నన్ను మ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తా. వదంతులు నమ్మవద్దు’ అని కోరారు.