pawan modi babu

Viral : ఒకే ఫ్రేమ్ లో మోడీ , పవన్ , బాబు

మరోసారి ముగ్గురు అగ్ర నేతలు కలువడం..ఒకే ఫ్రేమ్ లో ఉండడం అభిమానుల్లో , పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపుతుంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే ప్రధాని మోడీ , ఏపీ సీఎం చంద్రబాబు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురి కలయిక గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్ , మోడీ సంభాషణ , వీడియోస్ , ఫొటోస్ ఎంతగా వైరల్ గా మారాయో తెలియంది. కాదు ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురు కలిశారు.

హరియాణాలోని చండీగఢ్ నిన్న గురువారం జరిగిన NDA నేతల సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మోదీ, బాబు, పవన్లు ఒకే ఫ్రేమ్ల ఉన్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. మీటింగ్ హాల్లో పవన్ను చూసిన మోదీ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. పక్కనే బాబు కూడా ఉండగా ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జే.పి. నడ్డా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు గోవా ముఖ్యమంత్రి ప్రమోడ్ సావంత్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యాంగం యొక్క ‘అమృత మహోత్సవం’ మరియు 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితి గురించి 50వ వార్షికోత్సవం పై కూడా దృష్టి సారించారు.

Related Posts
బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్
బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్

జాన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సోమవారం మాట్లాడారు. తాను ఎటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనలేదని, అయితే బెయిల్ ఉత్తర్వులపై సంతకం చేయాలని వచ్చినప్పుడు నిరాకరించానని Read more

హర్యానా ఎన్నికలు.. డేరా బాబాకు మరోసారి పెరోల్‌
Haryana elections. Parole of Dera Baba once again

Haryana elections.. Parole of Dera Baba once again న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్‌ Read more

బిహార్ లో మఖానా బోర్డు.. దాని గురించి తెలుసా?
Makhana Board

బిహార్ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మఖానా గురించి అందరి ఆసక్తి Read more

ఏపీలో నేటి నుండి ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం
Pothole free roads

సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న "గుంతల రహిత రోడ్ల నిర్మాణం" కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని రహదారులను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *