TTD: తిరుమలలో రెండు నెలల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

TTD: తిరుమలలో రెండు నెలల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానము (టీటీడీ) వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మే, జూన్‌ రెండు నెలలపాటు వేసవి సెలవుల వల్ల కుటుంబాలతో శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వారికీ ఎలాంటి ఇబ్బందులకు లేకుండా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతించరాదని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.మే, జూన్ నెలల్లో సెలవులు కావడంతో తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.. మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫారసు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు” ఆయన వివరించారు. అంటే, ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisements

ఉత్సవాల్లో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుంచి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇందుకోసం మే 10న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ జరుగుతుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఉత్సవాల్లో భాగంగా మే 12న ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారి ఊరేగింపు ఉంటాయి.

 TTD: తిరుమలలో రెండు నెలల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

పూజాసామగ్రి

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా జల్లి సంప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

Read Also: Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు సుప్రీంకోర్టు ఊహించని షాక్

Related Posts
కేజ్రీవాల్‌ కేసు..ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
11 1

న్యూఢిల్లీ: ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. ఎక్సైజ్‌ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో తనపై Read more

పిఎల్‌ఐ పథకం కింద మెరిల్ వారి అధునాతన తయారీ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాని
Merrill was the pm modi who launched their advanced manufacturing facility under the PLI scheme

గుజరాత్ : భారతదేశంలో అగ్రగామి గ్లోబల్ మెడ్‌టెక్ కంపెనీల్లో ఒకటైన మెరిల్ తమ అత్యాధునిక ఉత్పత్తి ప్రాంగణాలను గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉత్పత్తి Read more

ఢిల్లీలో AQI 273కి చేరింది, అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన..
delhi aqi

న్యూ ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (AQI) సోమవారం ఉదయం 8 గంటల సమయంలో 273 వద్ద నమోదయ్యింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ప్రకారం Read more

17.1 మిలియన్ల ఓటర్లతో శ్రీలంకలో స్నాప్ ఎన్నికలు: ఫలితాలు శుక్రవారం
vote

శ్రీలంకలో 17.1 మిలియన్ల మంది ఓటర్లు గురువారం పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొననున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న ఏడు వారాల తర్వాత ఈ స్నాప్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×