Vikram Misri: యుద్ధంపై అసత్యాలను ప్రచారం చేయద్దు:విక్రమ్ మిస్రీ

Vikram Misri: యుద్ధంపై అసత్యాలను ప్రచారం చేయద్దు:విక్రమ్ మిస్రీ

భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన “ఆపరేషన్ సింధూర్” నేపథ్యంలో, పాకిస్థాన్ అనవసర ఆరోపణలతో అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న తరుణంలో, పాకిస్థాన్ చేస్తున్న కుతంత్రాలను, ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్‌ను భారత్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటోందని పాక్ చేస్తున్న నిరాధార ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

Advertisements

పాక్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం – మిస్రీ

విక్రమ్ మిస్రీ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించారు-ఆఫ్ఘనిస్థాన్‌ను లక్ష్యంగా భారత్ క్షిపణి ప్రయోగాలు చేస్తోందని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు, నిజానికి భారత్-ఆఫ్ఘన్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దెబ్బతీయాలనే కుట్రగా మిస్రీ పేర్కొన్నారు. పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరధారమైనవి. ఆఫ్ఘన్ ప్రజలకు మా దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా అక్కడి మౌలిక సదుపాయాలను, ప్రజలను ఎవరు లక్ష్యంగా చేసుకుంటున్నారో (పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ) ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదని భావిస్తున్నాను. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం సొంత దేశ ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకతను, విమర్శలను ఎదుర్కొంటోంది అని మిస్రీ తెలిపారు.

పాకిస్థాన్‌కు స్వదేశంలోనే వ్యతిరేకత

మిస్రీ తన ప్రకటనలో మరింత తీవ్రంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాకిస్థాన్ సొంత దేశంలో ప్రజలు తమ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దాన్ని విస్మరించి భారత్‌ను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ అధికారుల తీరును విమర్శిస్తూ, “భారత ప్రభుత్వంపై ఇక్కడి పౌరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తారని, తద్వారా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతుందని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధులు భ్రమల్లో సంతోషం వెతుక్కుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదానికీ ఒక నిర్దిష్టమైన విధానం ఉంటుందని, ఆ విషయం పాకిస్థాన్‌కు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించదని ఆయన ఎద్దేవా చేశారు.

Read also: Operation Sindoor: యుద్ధంలో మరణించిన ప్రముఖ టెర్రరిస్టులు

Related Posts
ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు కు ప్రధాని మోదీ
PM Modi to visit France in February

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే Read more

Market Committee : 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన
markets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. Read more

రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల
రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల

జైలర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన తరువాత, మేకర్స్ ఇప్పుడు దాని సీక్వెల్ను ప్రకటించారు. మకర సంక్రాంతి సందర్భంగా, రజనీకాంత్ నటించిన జైలర్ 2 మేకర్స్ Read more

ఎక్స్‌పై సైబర్ దాడి ఉక్రెయిన్ పనే: మస్క్!
'ఎక్స్'ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)పై భారీ సైబర్ దాడి జరిగినట్టు ఆ సంస్థ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×