Andhra Pradesh: జూన్ 2 నుండి విజయవాడ బెంగళూర్ విమానసేవలు

Andhra Pradesh: జూన్ 2 నుండి విజయవాడ బెంగళూర్ విమానసేవలు

కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపికబురు చెప్పింది.రాష్ట్రం నుంచి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్‌లకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. రాష్ట్రంలో విమాన కనెక్టివిటీని పెంచడానికి ఈ కొత్త విమానాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం-అబుదాబి మధ్య విమాన సర్వీసులు జూన్ 13 నుంచి ప్రారంభమవుతాయని,ఈ విమానాలు వారానికి నాలుగు రోజులు నడుస్తాయన్నారు. దీని ద్వారా యూఏఈ, ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది అంటున్నారు.విశాఖపట్నం-భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి మొదలవుతుందని,విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు జూన్ 2 నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)’కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్’ కలను నెరవేర్చేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు జూన్ 2 నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని,దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం నుంచి బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చు అన్నారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రమంతటా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలను ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంటున్నారు.

Advertisements
136884409 airliner 3000x1000
విజయవాడ బెంగళూర్ విమానసేవలు

ప్రస్తుతం

రాష్ట్రంలోని ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు, కొత్త విమాన మార్గాలు,ఆధునిక సదుపాయాలతో కూడిన సేవలపై దృష్టిసారిస్తున్నామని ఆయన చెప్పారు.మరోవైపు విజయవాడ నుంచి విశాఖపట్నంకు జూన్‌ 1 నుంచి నూతన విమాన సర్వీసును ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇండిగో సంస్థ (Indigo Company)ఈ సర్వీసును నిర్వహించనుంది. ఈ విమాన సర్వీసు ఉదయం 7:15కు విజయవాడలో బయలుదేరి విశాఖకు ఉదయం 8:25కు చేరుకుంటుందని పౌర విమానయానశాఖ మంత్రి కె రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి 8:45కు బయలుదేరి విజయవాడకు 9:45కు తిరిగివస్తుందన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉదయం వేళ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చి వెళ్లే ఒక్క సర్వీసు మాత్రమే నడుస్తోంది. ‘చెన్నై నుంచి విజయవాడకు(Vijayawada)ఉదయం 8.05కు వచ్చి, ఇక్కడి నుంచి 8.45కి బయలుదేరి విశాఖ వెళుతోంది. ఇందులో రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లి, అక్కడి నుంచి విశాఖకు వెళ్లాల్సి వస్తోంది’ అంటున్నారు. ఈ క్రమంలో కొత్త సర్వీస్ ప్రారంభించారు.

Read Also :Security: జగన్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టు లో పిటీషన్

Related Posts
TamilNadu: తమిళనాడులో మయోన్నైస్ నిషేధం
TamilNadu: తమిళనాడులో మయోన్నైస్ నిషేధం

తమిళనాడు ప్రభుత్వం పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోన్నైస్ ను ఒక సంవత్సర కాలం పాటు నిషేధించింది. ఈ నిషేధం ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకం, అన్నింటికీ Read more

హైపర్ లూప్ ట్రాక్ రెడీ: అశ్వినీ వైష్ణవ్
హైపర్ లూప్ ట్రాక్ రెడీ: అశ్వినీ వైష్ణవ్

భారత్ లో రైల్వేలు వేగంగా మారిపోతున్నాయి. సంస్కరణల కోసం గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలితాలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే వందే భారత్ Read more

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
stock market

భారత స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొనుగోళ్ల అండతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఇయర్ ఎండింగ్ లో వరుస నష్టాలకు Read more

Balakrishna: బంగారపు వాసవీమాత విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ
Balakrishna: బంగారపు వాసవీమాత విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ

హిందూపురంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం 85వ వార్షికోత్సవాన్ని ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భం ఆలయ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తోంది. అమ్మవారి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×