Vijayasai Reddy: పాకిస్తాన్ కి ఎలా బుద్ది చెప్పాలో మోడీ కి విజయసాయిరెడ్డి సలహా

Vijayasai Reddy: పాకిస్తాన్ కి ఎలా బుద్ది చెప్పాలో మోడీ కి విజయసాయిరెడ్డి సలహా

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ పదవికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు.నిన్న మొన్నటి వరకూ వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సంచలన విషయాలు బయటపెట్టిన సాయిరెడ్డి ఇప్పుడు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించారు. ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక సలహా ఇచ్చారు. పాకిస్తాన్ పీచమణచాలంటే కేంద్రం ఏం చేయాలో సాయిరెడ్డి చెప్పేశారు.భారత్ లో సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును తప్పుబడుతూ వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? దావూద్ ఇబ్రహీం ఎక్కడ నివసిస్తున్నాడు? మసూద్ అజార్ ఎక్కడ దాక్కున్నాడు? ఒకే సమాధానం పాకిస్తాన్ అని సాయిరెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఎగుమతిదారు పాకిస్తాన్ అన్నారు.

Advertisements

వీరోచితంగా

దీనికి విరుగుడుగా భారత్ ఏం చేయాలో సాయిరెడ్డి సలహా ఇచ్చారు. భారతదేశం బలూచ్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని సాయిరెడ్డి కోరారు. అలాగే పాకిస్తాన్ నుండి పుట్టిన కొత్త దేశాలతో 1971ని పునరావృతం చేయాలంటూ కేంద్రానికి సూచించారు. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై 1971 తరహాలోనే మరోసారి యుద్దం చేయాలంటూ దేశంలో డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి కూడా అదే డిమాండ్ చేసారు.1971లో పాకిస్తాన్ పై వీరోచితంగా యుద్దం చేసిన భారత సేనలు.. ఆ దేశంలోని తూర్పు భాగాన్ని వేరు చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేశాయి. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్నేకొత్త మిత్రులైన పష్తూన్ ( పాక్-ఆప్ఘన్ సరిహద్దుల్లో ఉన్న గిరిజనులు), బలోచ్ (పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు)తో కలిసి రిపీట్ చేయాలని సాయిరెడ్డి కోరుతున్నారు. సాయిరెడ్డి డిమాండ్ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కళ్లెదుటే

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో త్రుటిలో బయటపడిన కొందరు అక్కడ పరిస్థితి చూసి భయంతో వణికిపోయారు. ప్రత్యక్షంగా ముష్కరుల మారణహోమాన్ని చూసిన వారు కొండలు, గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలిపోయారు. తమ కళ్లెదుటే కన్న బిడ్డలను, కట్టుకున్నవాళ్లను, తోబుట్టువులను, బంధువులను, స్నేహితులను కోల్పోయిన బాధతో గుండెలవిసేలా రోదించారు. ముష్కర మూకల దాడి తర్వాత తమను కాపాడటానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ జవాన్లను చూసి కూడా భయాందోళనకు గురయ్యారు.

Read Also: Kurnool Government Hospital : కర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అరుదైన చికిత్స

Related Posts
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం – రేఖా గుప్తా కీలక నిర్ణయాలు
ప్రమాణ స్వీకార అనంతరం రేఖా గుప్తా తన మొదటి ప్రసంగంలో కొన్ని కీలక అంశాలను ప్రకటించారు.

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం – పాలన ఎలా ఉండబోతోంది? ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా Read more

Marri Rajasekhar: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక
Marri Rajasekhar: వైసీపీకి గుడ్‌బై - టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు అడుగులు Read more

నోటీసుల నేపథ్యం లో వీడియో తొలగించిన రణ్‌వీర్
నోటీసుల నేపథ్యం లో వీడియో తొలగించిన రణ్‌వీర్

ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి Read more

చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు
చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు

తల్లిఒడిలో అల్లారుముద్దుగా పెరగాల్సిన ముక్కుపచ్చలారని పసికందులను.. అక్రమ రవాణాకు అలవాటు పడ్డ రాబందులు రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్నాయి. చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో ఇతర రాష్ట్రాల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×