ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసు ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను పెంచింది. అనేక ఆరోపణల నడుమ ఈ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసుకు సంబంధించి పలువురు కీలక నాయకులకు నోటీసులు జారీ చేయడంతో, రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాజాగా, ఈ దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది.

సిట్ దూకుడు.. విజయసాయికి నోటీసులు
ఈ కేసులో కీలక అంశాలను వెలికి తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చురుకుగా పనిచేస్తోంది. అనుమానాస్పద లావాదేవీలపై సిట్ బృందం దృష్టిపెట్టగా, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని మొదట ఏప్రిల్ 15న నోటీసులు ఇచ్చినా విజయసాయి ఆరోజు హాజరు కాలేదు. తర్వాత విచారణ తేదీగా ఏప్రిల్ 17ను ఎంపిక చేసుకుని మళ్లీ సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికీ హాజరు కాలేదు. తాజాగా, ఇవాళ (ఏప్రిల్ 18) విచారణకు వస్తానంటూ సిట్కి సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు సిట్ ముందు ఆయన విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఇవాళ సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు. సిట్ విచారణలో ఆయన ఏం చెబుతారు. ఎలాంటి సంచలన విషయాలు బయటపెడతారోననే ఉత్కంఠ నెలకొంది. పూర్వంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కీలక మలుపు తీసుకొస్తున్నాయి. ఆయన ఒక సందర్భంలో లిక్కర్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అన్నీ రాజ్ కసిరెడ్డేనంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దర్యాప్తు దృష్టిలో కీలక ఆధారంగా మారే అవకాశముంది. అందుకే ఆయనను సాక్షిగా విచారించేందుకు సిట్ చర్యలు తీసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, లిక్కర్ డీలర్లు, మిడిల్మెన్లు విచారణకు హాజరయ్యారు. తాజా జాబితాలో ఉన్నవారు విజయసాయి రెడ్డి (మాజీ ఎంపీ), మిధున్ రెడ్డి (వైసీపీ ఎంపీ), రాజ్ కసిరెడ్డి (వైసీపీ నేత) వీళ్లపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, వారిని విచారించేందుకు సిట్ చర్యలు తీసుకుంటోంది.
ఇదే కేసులో అటు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు రావాలని రాజ్ కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. అయితే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ మూడు సార్లు రాజ్ కసిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో వీరు విచారణకు హాజరవుతారా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా ఈ కేసు తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశమున్నది. విజయసాయిరెడ్డి విచారణలో ఏమి బయటపడుతుందో అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు కారణమైంది.
Read also: Pavan Kalyan : 345 మందికి పాదరక్షలు పంపిన పవన్ కళ్యాణ్