Vijaya Shanthi: ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్ స్పందించిన విజ‌య‌శాంతి

Vijaya Shanthi: ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్ స్పందించిన విజ‌య‌శాంతి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా భయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు సైతం సమర్పించుకుంది. క్రిస్టియన్ అయినా అన్నా లెజినోవా ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి హిందూ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకుంది. అనంతరం నిత్యాన్నాదనం కోసం రూ.17 లక్షలు విరాళం అందచేసింది. అంతేకాకుండా భక్తులతో కలిసి నిత్యాన్నాదనంలో పాల్గొంది. విదేశాల్లో పుట్టిపెరిగిన అన్నా లెజినోవా.. భారత్ కు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంపై ఆమెపై ప్రశంసలు వచ్చాయి. కొడుకు కోసం అన్నా లెజినోవా చేసిన మంచి పనిని చాలా మంది పొగిడారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అన్నా లెజినోవా తీరుపై నెట్టింట ట్రోల్స్ చేశారు.

Advertisements

కృతజ్ఞత

తన ట్విట్టర్ ఖాతాలో అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. హరహర మహాదేవ్, జై తెలంగాణ” అంటూ ట్విట్టర్ ఖాతాలో రాసుకోచ్చారు విజయశాంతి.

స‌పోర్ట్

అనుకోకుండా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌ని విమ‌ర్శిస్తున్న సమ‌యంలో తోటి మ‌హిళ‌గా విజ‌య‌శాంతి ముందుకు వ‌చ్చి స‌పోర్ట్ చేయ‌డం చాలా గొప్ప ప‌రిణామం అంటూ ఆమెని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక విజ‌య‌శాంతి న‌టించిన అర్జున్ స‌న్ ఆఫ్ విజ‌య‌శాంతి చిత్రం ఏప్రిల్ 18న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Read Also: Election Commission : ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Related Posts
PawanKalyan: ద‌ర్శ‌కుడు ర‌మేశ్ కు సానుభూతి తెలిపిన ప‌వ‌న్ కళ్యాణ్
PawanKalyan: ద‌ర్శ‌కుడు ర‌మేశ్ కు సానుభూతి తెలిపిన ప‌వ‌న్ కళ్యాణ్

ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. Read more

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసు తెరపైకి రోజుకో అంశం
Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసు తెరపైకి రోజుకో అంశం

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఈ కేసును సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు.సీసీ కెమేరాల్లో రికార్డు అయిన Read more

Cheating: ప్రేమ పేరుతో మోసపోయిన థాయ్‌లాండ్‌ యువతి చివరికి ఏమైంది!
Cheating

ప్రేమ పేరుతో మోసం: థాయ్‌లాండ్ యువతి జీవితం తలకిందులైన కథ ప్రేమ అనేది రెండు హృదయాల మధ్య ఏర్పడే అపారమైన అనుబంధం. ఈ భావన ప్రాంతాలు, భాషలు, Read more

Uttam Kumar Reddy : కాళేశ్వరం జేబులు నింపేందుకు
Uttam Kumar Reddy : కాళేశ్వరం జేబులు నింపేందుకు

కాళేశ్వరం ప్రాజెక్ట్ – జేబులు నింపుకోవడానికే అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు తీవ్ర దుమారం రేపుతోంది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×