తెలుగు రాష్ట్రాలకు వెంకయ్య నాయుడు రూ.10 లక్షల సాయం

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా వరద నీరే కనిపించడంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. భారీ పంట నష్టం, ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా సంభ‌వించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు.

వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున పంపినట్లు తెలిపారు. అలాగే తన కుమారుడు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున, తన కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున సాయం చేసినట్లు పేర్కొన్నారు.