సీఎం రేవంత్‌ను ఆశీర్వదించిన వేములవాడ ఆలయ అర్చకులు

సీఎం రేవంత్ రెడ్డికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చక బృందం వేద ఆశీర్వచనం అందజేశారు. శుక్రవారం హైదరాబాదులోని సచివాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించి రాజన్న ప్రసాదం అందజేశారు.

వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించినందుకు రేవంత్‌కు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు ఆలయ అర్చకులు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.