గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత వల్లభనేని వంశీ మరోసారి న్యాయపరంగా నిరాశే ఎదురైంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఆయన పేరు నిందితుడిగా చర్చకు రావడంతో పోలీసులు అతనిపై గట్టి ఆధారాలతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఈ కేసులో వంశీతో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే వంశీ రిమాండ్ గడువు పూర్తయ్యే దశకు రావడంతో, పోలీసు శాఖ న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ, మరింత విచారణ అవసరమని, నిందితుడి కస్టడీ పొడిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు వాదనలను సమీక్షించిన అనంతరం వంశీతో పాటు మిగిలిన నలుగురు నిందితులకు మే 6వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో సత్యవర్థన్ అనే యువకుడిని బెదిరింపులతో పాటు బలవంతంగా అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల అనుసంధానంలో కీలకంగా వ్యవహరించిన వంశీ, ఈ సంఘటనకు మూల కారకుడిగా ఉన్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు, సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Read also: Student Attacks Lecturer: లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే?