tirumala 1

జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ..

తిరుమల: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జనవరి 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12వ‌ తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంట‌ల నుండి 1.20 లక్షల టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.

తిరుప‌తిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మైదానం , శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్‌ల‌తో పాటు(తిరుమలలో బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో తిరుమల స్థానికుల కొరకు) కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.

కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భ‌క్తుల‌కు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివ‌రించారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్‌ల‌తో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సీఈ స‌త్య‌నారాయ‌ణ, ఎస్ఈ వెంక‌టేశ్వ‌ర్లు, మనోహర్, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, తదితర టీటీడీ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Related Posts
మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించిన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్
LIC Mutual Fund launched Multi Asset Allocation Fund

ముంబై : భారతదేశంలోని ప్రసిద్ధ ఫండ్ హౌస్‌లలో ఒకటైన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, డెట్ మరియు బంగారంలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ స్కీమ్ అయిన ఎల్ఐసి Read more

కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపు : ఆర్‌బీఐ
0.25 percent cut in key interest rates.. RBI

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్, రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. రెపో రేటును నాలుగో వంతు తగ్గించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రెపో Read more

1,000 రోజుల యుద్ధం: యుక్రెయిన్, రష్యా ఆటోమేషన్ వైపు అడుగులు
rusia ukraine war scaled

రష్యా ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్‌పై తన పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించినప్పటి నుండి 1,000 రోజులు పూర్తయ్యాయి. ఈ 1,000 రోజుల యుద్ధంలో ఎన్నో తీవ్ర సంఘటనలు Read more

నేడు తిరుపతిలో పవన్ వారాహి బహిరంగ సభ
Pawan Varahi public meeting in Tirupati today

Pawan Varahi public meeting in Tirupati today అమరావతి: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు తిరుపతిలో వారాహి బహిరంగ సభ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *