గాజాపై దాడి సమాచారం తమకు ముందస్తు తెలిపింది: అమెరికా

Israel: గాజాపై దాడి సమాచారం తమకు ముందస్తు తెలిపింది: అమెరికా

హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో గాజాలో సుమారు 200 మంది వరకు చనిపోయారని సమాచారం. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని మండిపడింది.

Advertisements
గాజాపై దాడి సమాచారం తమకు ముందస్తు తెలిపింది: అమెరికా

ఇజ్రాయెల్ దాడులపై అగ్రరాజ్యం స్పందన
ఈ దాడితో తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. గాజాపై దాడికి సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం తమకు ముందస్తు సమాచారం ఇచ్చిందని తెలిపింది. తమను సంప్రదించాకే దాడి చేసిందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్ మిలిటెంట్లకు, హుతీలకు ఇదొక హెచ్చరిక అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ చెప్పారు.
హమాస్ ను హెచ్చరించిన ట్రంప్
బందీలను విడిచిపెట్టాలని, గాజాను వదిలిపెట్టి వెళ్లాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హమాస్ ను హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ప్రస్తుతం దాని ఫలితం అనుభవిస్తోందని పేర్కొన్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు, బందీల అప్పగింతకు హమాస్ అంగీకరించకపోవడం వల్లే గాజాపై దాడులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు.

Related Posts
Mexico: ఉత్తర మెక్సికోలో పికప్ ట్రక్ లోయలో పడి 12 మంది మృతి
Mexico: ఉత్తర మెక్సికోలో పికప్ ట్రక్ లోయలో పడి 12 మంది మృతి

ఉత్తర మెక్సికోలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించగా, నలుగురు గాయపడ్డారు. దీంతో అడవి మంటలు చెలరేగాయని, ఆ మంటలు తరువాత అదుపులోకి Read more

PM Modi : ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
Sri Lanka highest award for Prime Minister Modi

PM Modi : భారతదేశం, శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ఉమ్మడి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శ్రీలంక Read more

ఆస్ట్రేలియాలోని హంపీ ఐలాండ్ సమీపంలో షార్క్ దాడి
shark

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ సమీపంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. 40 సంవత్సరాల వ్యక్తి తన కుటుంబంతో కలిసి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లినప్పుడు, షార్క్ చేత Read more

నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో ఆనవాయితీగా నాగర్‌ కర్నూల్ జిల్లాలోని సొంతూరు కొండారెడ్డిపల్లెలో, ఆ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×