భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా న్యాయ శాఖ చేసిన నేరారోపణ తీవ్రమైనవని, భౌగోళిక రాజకీయ పరిణామాలతో కూడిన వ్యూహాత్మక తప్పిదమని ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ నివేదిక స్పష్టం చేసింది. చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్తో అమెరికా బలమైన భాగస్వామ్యం కోరుకుంటున్న సమయంలో ఈ ఆరోపణలు చేయడం ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ‘భారత్పై తీవ్ర నేరారోపణతో పశ్చిమ దేశాల సంబంధాలకు అమెరికా విఘాతం కలిగిస్తోంది’ అనే శీర్షికన ఆథర్ మెలిక్ కేలన్ రాసిన ఆర్టికల్ను ఫోర్బ్స్ ప్రచురించింది. అమెరికాలో నిధుల సమీకరణ కోసం 25 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 2,100 కోట్లు) లంచంగా ఇవ్వజూపారని, పశ్చిమ దేశాలకు భారత్ కీలకమైన భాగస్వామి అని, ముఖ్యంగా చైనా ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ ఇనిషియేటివ్ కు పోటీగా రూపొందించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ను ఆర్టికల్ హైలైట్ చేసింది. ‘‘అయితే అమెరికా న్యాయశాఖ చర్య కీలకమైన సమయంలో ఆర్థిక సహకారం, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.. ఇది భారత్ను రష్యా, చైనాలకు దగ్గర చేసే అవకాశం ఉంది.

దీని వల్ల అమెరికా తన సొంత భౌగోళిక రాజకీయ స్థానాన్ని బలహీనపరుస్తుంది.. ప్రత్యర్థులు మరింత బలోపేతం కావడానికి వీలు కల్పిస్తుంది’’ అని ఫోర్బ్స్ తెలిపింది.అదానీ, ఆయన బంధువులపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. అదానీపై అమెరికా న్యాయశాఖ చర్య కేవలం చట్టపరమైన నిర్ణయం కాదని.. ప్రపంచ స్థిరత్వానికి పశ్చిమ దేశాలతో భారత్ పొత్తు చాలా కీలకమైన సమయంలో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న దౌత్యపరమైన వ్యూహాత్మక తప్పిదమని ఫోర్బ్స్ మండిపడింది.